కరోనా పై దేశమంతా పోరాటం చేస్తుంటే రాజస్థాన్ లో మాత్రం రాజకీయం వేడెక్కుతుంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.12 కోట్లు ఆఫర్ చేస్తోందని ఆయన ఆరోపించారు. దేశమంతా కరోనా పై పోరాడుతుంటే బీజేపీ మాత్రం తమ ప్రభుత్వం పై పోరాడుతుందన్నారు. తమ పార్టీకి మద్దతిచ్చే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని,అవి సాగవని ఆయన హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ వైఖరి సరికాదన్నారు. దేశమంతా కరోనాతో పోరాడుతుందని చేతనైతే ఈ పోరాటంలో ప్రభుత్వానికి సహకరించాలని గెహ్లాట్ బీజేపీకి సూచించారు.