పీఎం కిసాన్ స్కీంలో చేరిన వారికి కేంద్రం రూ.6 వేలు అందిస్తుంది. ఈ డబ్బులు రూ.2,000 చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమవుతుంది. ఆగష్టు 1 నుంచి అన్నదాతలకు రూ.2 వేలు డబ్బులు అందనున్నాయి. ఇప్పటికి కూడా ఈ పథకంలో చేరని వారు ఉంటే సులభంగానే ఇంట్లో నుంచే ఈ పథకంలో చేరొచ్చు. మీ పొలం వివరాలు, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా సమాచారాన్ని పీఎం కిసాన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు.