ప్రముఖ మొబైల్ తయరీ సంస్థ షియోమీ తన రెడ్ మీ కే20 ప్రో స్మార్ట్ ఫోన్ పై భారీ ఆఫర్ ను ప్రకటించింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ పై రూ.2,000 తగ్గింపును అందించింది. అయితే జులై 13వ తేదీ వరకు మాత్రమే ఈ ధర తగ్గింపు అందుబాటులో ఉండనుంది. తగ్గిన ధరకే అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కాంలో ఈ మొబైల్ అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్ లో ఈ మొబైల్ ధర రూ.2,000 పెరిగింది. స్మార్ట్ ఫోన్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 18 శాతానికి పెరగడమే దీనికి కారణం. ఈ ధర తగ్గింపుతో రెడ్ మీ కే20 ప్రో స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర రూ.24,999కు చేరుకుంది. రెడ్ మీ కే20 ప్రో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. కార్బన్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్, గ్లేసియర్ బ్లూ, పెరల్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ ప్రత్యేకతలు..
6.39 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే ఉంది. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 19.5:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరాగా 48 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్586 సెన్సార్ ను అందించారు. 13 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్ కూడా ఉండడం విశేషం. ముందువైపు 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్ కాగా, 27W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ మొబైల్ లో ఉన్నాయి.