కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు వార్షిక పరీక్షలు, ప్రవేశ పరీక్షలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఫెయిలైన ఇంటర్ సెకండియర్ విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించామని సంతోషిస్తున్నారు. కానీ ఎంసెట్ పరీక్ష రాయాలనుకుంటున్న విద్యార్థులే బాధపడుతున్నారు. దరఖాస్తు ఫీజు చూసి ఆందోళన చెందుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ దరఖాస్తుకు రూ.10వేల ఆలస్య రుసుముతో ఈ నెల 15వరకు పొడిగించారు. పాస్ అయిన ఇంటర్ విద్యార్థులు ఇప్పుడు ఎంసెట్కు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఇంకా ఐదు రోజుల గడువు ఉన్నప్పటికీ.. ఆలస్య రుసుం రూ.10 వేలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.