ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ నెస్లే ఇండియా వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు ఈ ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేయొచ్చు. Nesternship పేరుతో 1000 యువతకు వర్చువల్ ఇంటర్న్షిప్ అవకాశాలను నెస్లే ఇండియా అందిస్తోంది. నాలుగు నెలల పాటు ఈ ఇంటర్న్షిప్ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 8న మొదలైంది. ఆగస్ట్ 1న ఈ ఇంటర్న్షిప్ ప్రారంభమవుతుంది. నెలకు 250 మంది చొప్పున నవంబర్ వరకు ఇంటర్న్షిప్ కొనసాగనుంది. ఆసక్తి గల విద్యార్థులు నెస్లే ఇండియా అధికారిక వెబ్సైట్ లేదా ఇంటర్న్శాలా ప్లాట్ఫామ్లో దరఖాస్తు చేయొచ్చు.జూలై 10లోగా దరఖాస్తు చేయాలి. కరోనా కారణంగా వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ను నెస్లే అందిస్తోంది. విద్యార్థుల 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ మార్కులు, గతంలో చేసిన ఇంటర్న్షిప్స్, అనుభవం లాంటివన్ని పరిగణలోకి తీసుకొని వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు నెస్లే ఎంపిక చేయనుంది. విద్యార్థుల సాఫ్ట్ స్కిల్స్ పెంచేందుకు ఈ ఇంటర్న్షిప్ ఉపయోగపడుతుంది. ప్రీ-రికార్డెడ్ లెర్నింగ్ సెషన్స్ సైతం ఉండనున్నాయి. విద్యార్థులకు ఉద్యోగావకాశాలను పెంచేందుకు సీవీ క్లినిక్ సైతం ఉంటుంది. ఇంటర్న్షిప్ విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఉపకారవేతనంతో పాటు ధుృవీకరణ పత్రం సైతం లభిస్తోంది.