ఏపీఎస్ ఆర్టీసీకి గూగుల్ ప్లే స్టోర్లో ఆల్రెడీ ఓ యాప్ ఉంది. అది జిల్లాల్లో బస్సుల్లో ప్రయాణించడానికి ఉపయోగపడుతోంది. సిటీ బస్సుల్లో టికెట్ బుక్ చేసుకోవడానికి ఇప్పుడు ఏపీ సర్కార్ కొత్త యాప్ తేబోతోంది. కరోనా నేపథ్యంలో బస్సుల్లో టికెట్ తీసుకునే విధానాన్ని కూడా ఆన్లైన్లోకి తెచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఓ కొత్త యాప్.. ప్రథమ్ యాప్ అనేది రెడీ అవుతోంది. అయితే ఆ పేరు ఇంకా ఫైనల్ కాలేదు. వచ్చే నెలలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా ముందుగా విశాఖ, విజయవాడ సిటీ బస్సుల్లో టికెట్లు కొనుక్కునేలా చెయ్యాలని భావించినా ఆ తర్వాత పల్లె వెలుగు సహా అన్ని బస్సులకూ ఈ యాప్నే వాడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.