భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. చాలా కుటుంబాలు లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నాయి. పేద,మధ్య తరగతి ప్రజలు అసలు కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సమయంలోనే కేంద్రం వారికి ఊరటనిచ్చేలా ఉచిత బియ్యం,కందిపప్పును 3 నెలలుగా అందిస్తుంది. ప్రస్తుతం కూడా ఇంకా అన్ని పరిస్థితులు కుదుటపడకపోవడంతో కేంద్రం మరో 3 నెలలపాటు ఉచితంగా బియ్యం,కందిపప్పును అందించాలనే యోచనను కేంద్రం చేస్తునట్టుగా సమాచారం. దీని పై మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.