ఏపీ సీఎం జగన్ ఎమ్మెల్యే రోజాకు మరో కీలక పదవి అప్పగించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే రోజా ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్నారు. ఈ పదవి మంత్రి పదవితో సమానం. కరోనా ప్రభావంతో షూటింగ్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. షూటింగ్స్ కు సంబంధించి సీఎం జగన్ ప్రత్యేక పాలసిని తీసుకురావాలని చూస్తున్నారు.షూటింగ్స్ అనుమతికి సంబంధించి ఓ కమిటిని నియమించాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం. ఈ కమిటికి చైర్మన్ గా రోజాను నియమించాలని ఆయన భావిస్తున్నారట. ఇందులో ఓ ఐఏఎస్ అధికారి కూడా ఉండనున్నారు. షూటింగ్స్ అనుమతులకు సంబంధించి రోజా కమిటికి విన్నవిస్తే ఆమె ఐఏఎస్ అధికారి ద్వారా అనుమతి ఉత్తర్వులు జారీ చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.