ఏపీలోని నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. వైద్యఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 9700 డాక్టర్లు,ఇతర వైద్య సిబ్బంది నియామకాలు త్వరలోనే చేపట్టనున్నారు. కరోనా పై సీఎం జగన్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా వైద్య పరీక్షలను కూడా పటిష్టంగా చేస్తున్నామని,ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.