ఏపీలో లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ధృవ పత్రాలు పోలీస్ స్టేషన్లలో చూయించి వాహనాలు తీసుకెళ్లవచ్చని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇప్పటికే తెలిపారు. అయితే వారికి ఎంత జరిమానా విధించాలనే దాని పై స్పష్టత లేదు. వారికి ఎంత జరిమానా విధించాలనే దాని పై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎవరి వాహనాలు వారికి అప్పగించేటప్పుడు రూ.100 జరిమానా విధించాలన్నారు. ఈ నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట లభించినట్టైంది.