స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కూడా మారటోరియం అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. 2020 మార్చి 1 నుంచి 2020 మే 31 వరకు అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలు, వడ్డీని వాయిదా వేసేందుకు చర్యలు తీసుకుంది. రీపేమెంట్ పీరియడ్ను మూడు నెలలు పొడిగించినట్టు అధికారికంగా ప్రకటించింది. ఎస్బీఐలో టర్మ్ లోన్స్ అంటే హోమ్, పర్సనల్, ఎడ్యుకేషన్, ఆటో లాంటి రుణాలు తీసుకున్నవారు మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించకపోయినా పర్వాలేదు. అంతేకాదు... ఒకవేళ మార్చి 1 నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఈఎంఐలు చెల్లించినట్టైతే బ్యాంకుకు దరఖాస్తు చేసి వెనక్కి తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ను ఎస్బీఐ వివరించింది. ఈఎఐ రీఫండ్ 7 వర్కింగ్ డేస్లో అకౌంట్లోకి వస్తుంది. మారటోరియం ఎంచుకున్నవారు మూడు నెలలు వాయిదా వేసుకోవచ్చు. ఈఎంఐ చెల్లించనందుకు క్రెడిట్ స్కోర్కు ఇబ్బందేమీ ఉండదు. కానీ ఔట్స్టాండింగ్ ఎంత ఉందో దానికి వడ్డీ మాత్రం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆటో లోన్ రూ.6 లక్షలు తీసుకుంటే ఇంకో 54 నెలలు చెల్లించాల్సి ఉందనుకుందాం. అదనంగా వడ్డీ రూ.19,000 చెల్లించాలి. హోమ్ లోన్ రూ.30 లక్షలు తీసుకుంటే మరో 15 ఏళ్లు చెల్లించాల్సి ఉందనుకుందాం. అదనంగా వడ్డీ రూ.2.34 లక్షల వరకు అవుతుందని ఎస్బీఐ లెక్కేసి మరీ చెప్పింది. కాబట్టి డబ్బులు ఉన్నవారు మారటోరియం ఎంచుకోకుండా ఈఎంఐలు ఎప్పట్లాగే చెల్లించడం మంచిది.