ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగ్రాకు ఆశ్చర్యకరమైన బహుమతినిచ్చిన లాక్‌డౌన్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 27, 2020, 01:12 PM

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ పురాతన కట్టడమైన తాజ్‌మహల్ ఉన్న ఆగ్రా నగరానికి ఆశ్చర్యకరమైన బహుమతి తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్ వల్ల ఆగ్రా నగరంలో కాలుష్యం గణనీయంగా తగ్గిపోయి గాలి నాణ్యత పెరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆగ్రా విభాగాదిపతి కమల్ కుమార్ మాట్లాడుతూ ఆగ్రాలో లాక్‌డౌన్ సందర్భంగా వాహనాల రాకపోకలను సైతం నిలిపివేయడంతో గాలి నాణ్యత పెరిగిందని చెప్పారు. కాలుష్యనియంత్రణ అధికారి బీపీ యాదవ్ మాట్లాడుతూ వాయుకాలుష్యం తగ్గడం వల్ల పురాతన కట్టడమైన తాజ్ మహల్ కూడా కాలుష్యం కాటు నుంచి బయటపడవచ్చు. దీంతోపాటు ఆగ్రా నగరంలో వ్యాధులు సైతం తగ్గుముఖం పడతాయని ఆయన చెప్పారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com