ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 06:42 PM

మరికొన్ని రోజుల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. తాజాగా, జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీలను ప్రకటించారు. ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా, 5 సంయుక్త పార్లమెంటరీ కమిటీలను నియమించారు. ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ, గోదావరి సంయుక్త కమిటీ, సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ, రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ, రాయలసీమ సంయుక్త కమిటీలను ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com