ప్రజా సమస్యలపై పోరాటం తీవ్రతరం చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రజాచైతన్య సభలో చంద్రబాబు మాట్లాడారు. అన్న క్యాంటీన్లను ఎందుకు మూసేశారు? అని ప్రశ్నించారు. న్యాయం, ధర్మం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల మూసివేతపై నిరసన కొనసాగిస్తున్నామన్నారు. ఏపీలో ఇసుక ఎక్కడా దొరకడం లేదన్నారు. ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఆంధ్ర ఇసుక కర్ణాటకకు తరలిపోతోందన్నారు. రాయలసీమ ప్రజలు తాగు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.