ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికారులపై మంత్రి పిల్లి సుభాష్ అసహనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 04:00 PM

తూ.గో: ఇసుక పాలసీ అమలు విషయంలో అధికారులపై మంత్రి పిల్లి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు.శనివారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, విశ్వరూప్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుశాఖల అధికారులపై మంత్రి పిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక పంపిణీలో అధికారుల వైఫల్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. ఉచిత ఇసుక విధానంలో క్షేత్రాస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని...అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మంత్రి ఆగ్రహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com