ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి చర్చి పాస్లర్లకు గౌరవ వేతనంగా నెలకు రూ.5 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. అదే విధంగా గతంలో ఇమామ్ లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు, మౌజమ్ లకు ఇస్తున్న గౌరవ వేతనం 3 వేల రూపాయలను 5 వేల రూపాయలకు ప్రభుత్వం పెంచింది. దానిని కూడా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు. పాస్టర్ల గౌరవ వేతనానికి సంబంధించి గ్రామ, వార్డు వాలంటీర్లు పాస్టర్ల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో పాస్టర్లు హర్షం వ్యక్తం చేశారు.