చంద్రబాబుది ప్రజావంచన యాత్ర అని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. రైతుల ముసుగులో టీడీపీ గుండాలు దాడికి యత్నించారని రోజా అన్నారు. రాజధాని రైతులు నన్ను కాదు.. చంద్రబాబును అడ్డుకోవాలని అన్నారు. నేతలపై దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. సీఆర్డిఏను "చంద్రబాబు రిలేటెడ్ దోపిడీ ఏజెన్సీ"గా మార్చారని ఆమె తెలిపారు.నేతలపైనా అధికారులపైనా దాడులు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. ప్రజాచైతన్య యాత్ర ఇంచు కూడా ముందుకు కదలదు అని అన్నారు.