ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 03:55 PM

గాజువాక నియోజకవర్గ పరిధిలోని ఉక్కునగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. విశాఖ స్టీలుఫ్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న సిఐఎస్ఎఫ్ కానిస్టెబుల్ సాధు సతీష్ (30) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఐఎన్ఎస్ఏ రైఫిల్ తో కాల్చుకొని మృతి చెందాడు . మృతుడు సతీష్ శ్రీకాకుళం జిల్లాలోని ఏచ్చెర్ల మండలం, రంపపేట గ్రామ నివాసితుడు. బుధవారం తాను ఉద్యోగం చేస్తున్న ఉక్కు కర్మాగారం లోని క్లాక్ నంబర్ 11 వద్ద మృతుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఉల్లికిపడిన స్థానిక ఉద్యోగులు, సాటి సిఐఎస్ఎఫ్ జవాన్లు స్టీల్ ప్లాంట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతికి గల కారణాలు ఏంటి అని విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com