గాజువాక నియోజకవర్గ పరిధిలోని ఉక్కునగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. విశాఖ స్టీలుఫ్లాంట్లో ఉద్యోగం చేస్తున్న సిఐఎస్ఎఫ్ కానిస్టెబుల్ సాధు సతీష్ (30) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఐఎన్ఎస్ఏ రైఫిల్ తో కాల్చుకొని మృతి చెందాడు . మృతుడు సతీష్ శ్రీకాకుళం జిల్లాలోని ఏచ్చెర్ల మండలం, రంపపేట గ్రామ నివాసితుడు. బుధవారం తాను ఉద్యోగం చేస్తున్న ఉక్కు కర్మాగారం లోని క్లాక్ నంబర్ 11 వద్ద మృతుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఉల్లికిపడిన స్థానిక ఉద్యోగులు, సాటి సిఐఎస్ఎఫ్ జవాన్లు స్టీల్ ప్లాంట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతికి గల కారణాలు ఏంటి అని విచారణ చేపట్టారు.