అమరావతి: నేడు కడపలో భాజపా ధర్నా. భాజపా శ్రేణులలో ధర్నా.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ పాల్గొంటారని భాజపా మీడియా కన్వీనర్ వుల్లూరి గంగాధర్ ప్రకటన ద్వారా తెలిపారు.ఈ కార్యక్రమానికి రాయలసీమ లో ముఖ్యనాయకులు అందరూ పాల్గొంటారని గంగాధర్ తెలిపారు. అధికార పార్టీ ఆగడాలు రోజు రోజుకూ మితిమీరి పోతున్నాయని మా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బునాయించి హింసకు గురి చేసిన సందర్భంగా రాష్ట్ర డీజీపీ ను కలసి వినతి పత్రం ఇచ్చినా ప్రయోజనం లేదని ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మరియు కడప లో పోలీసుల అక్రమ కేసులకు నిరసనగా ధర్నా చేపట్టాలని నిర్ణయించాం