టిక్టాక్ వ్యామోహంతో దారితప్పిన భార్యను భర్త హత్య చేసిన ఘటన బన్రూట్టిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని కాడాంబులియూర్కు చెందిన కుమరవేల్ (26), నైవేలి దిడీర్కుప్పానికి చెందిన రాజేశ్వరిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.రాజేశ్వరి అదే ప్రాంతానికి చెందిన మెకానిక్తో వివాహేతర సంబంధం పెట్టుకుందని.. టిక్టాక్లో పలువురి యువకులతో పాటలు పాడుతూ, డాన్సులు చేసి పోస్టులు పెట్టినట్లు తెలిపాడు. ఆమెను మందలించినా పట్టించుకోలేదని..ఆగ్రహంతో ఇనుపరాడ్తో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.