తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. శ్రీలంక నుంచి బంగారాన్ని ఆదివారం తమిళనాడు తరలిస్తుండగా, సముద్రంలో అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.6కోట్లుగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు