ఉసేన్_బోల్ట్ వేగాన్ని అధిగమించిన భారతీయుడు, కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా మూడా బిద్రి కి చెందిన శ్రీనివాస_గౌడ కంబాల గా పిలువబడే పశువుల పరుగు పందెంలో వాటిని ఆదలిస్తూ 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకండ్ల సమయంలో అధిగమించాడు. ప్రపంచ ప్రఖ్యాత రన్నర్ ఉసేన్ బోల్ట్ ఒలింపిక్స్ లో 100 మీటర్ల దూరాన్ని 9.58 సెకండ్ల లో అధిగమిస్తే మన కన్నడ_వీరుడు 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకండ్ల లొనే అధిగమించాడు. ఇటువంటి అణిముత్యాలకు తగిన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉంది.