విజయవాడలో భారీగా బంగారం పట్టుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో20 కేజీల బంగారం పట్టుబడింది. ముంబై నుంచి కార్గో కొరియర్ ద్వారా బంగారం సరఫరా చేస్తున్నారు. నగరంలోని బంగారం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 17 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.