ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరోనా ఎఫెక్ట్.. పెట్రోలు ధరలు వరుసగా ఐదో రోజు తగ్గుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 10, 2020, 07:30 PM

పెట్రోలు ధరలు వరుసగా ఐదో రోజు కూడా కొంత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇది నాలుగు ప్రధాన నగరాల్లో మాత్రమే. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్‌కత్తా నగరాల్లో ఈ తగ్గుదల నమోదైంది. మొత్తంమీద గత ఐదు రోజుల్లో... ఈ నానలుగు మెట్రో నగరాల్లో లీటరుకు 93 పైసల వరకు తగ్గింది. ఢిల్లీ, ముంబైల్లో 13 పైసలు, చెన్నైలో 14 పైసలు, కోల్‌కతాలో 19 పైసలు తగ్గించినట్లు ప్రభుత్వరంగ వెబ్‌సైట్ వెల్లడించింది. ప్రస్తుతం పెట్రలు ధరలు లీటరుకు ఇలా ఉన్నాయి.
నగరం పెట్రోలు డీజిల్
న్యూఢిల్లీరూ. 72.10రూ. 67.39
కోల్‌కత్తారూ. 74.74రూ. 67.39
చెన్నైరూ. 74.90రూ. 68.71
ముంబైరూ. 77.76రూ. 68.19
కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో... చమురు దిగుమతి దేశాల్లో ఒకటైన భారత్‌లో చమురు డిమాండ్, సరఫరాలపై ప్రభావం పడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com