శాసనమండలి రద్దు సరైన నిర్ణయం కాదని ఏపీ పీసీసీ చీఫ్ శైలజనాథ్ విమర్శించారు. నాంపల్లిలోని ఇందీరాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తన తండ్రి వైఎస్సార్ తీసుకొచ్చిన మండలిని సీఎం జగన్ రద్దు చేసి ఆయన అశయాలకు తూట్లు పొడిచారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులపై సెలెక్ట్ కమిటీలో తాను ఓడిపోతానని తెలిసి ముఖ్యమంత్రి జగన్ మండలిని రద్దు చేశారని అన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం 1400 కోట్ల రూపాయాలు వైసీపీ కార్యకర్తల కోసం జగన్ విడుదల చేశారని శైలజానాథ్ ఆరోపించారు.