సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి పై టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా బుద్దా విమర్శల వర్షం కురిపించారు. ఆయన ఏమన్నారంటే.. “వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ గారు. తండ్రికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ పేరు ముందు నాన్న పేరు పెట్టుకున్నాడు. నాన్నని ముఖ్యమంత్రిని చేసిన సోనియా గాంధీ గారిని వెన్నుపోటు పొడిచి తాను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకున్నాడు జగన్ రెడ్డి. ఇప్పుడు తన స్వార్థం కోసం రాజధానిని విభజించాలి అని చూస్తున్నాడు. ధన బలం, అధికార మదంతో మండలిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూశాడు. తోడు దొంగలను రంగంలోకి దింపాడు.
ఎమ్మెల్సీలను కొనాలని చూసాడు. సంతలో పశువుల్లా ఇద్దరు ఎమ్మెల్సీలను కొన్నారు. ఆఖరికి మండలి సిబ్బందిని కూడా దగ్గర ఉండి మ్యానేజ్ చేసి.. బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపాలి అని టిడిపి ఇచ్చిన నోటీసు పక్కన పెట్టించి డ్రామా ఆడారు. మీ దొంగ పనులు గమనించిన ఛైర్మన్ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపితే రౌడిల్లా ఆయన మీద పడ్డారు. రెండు రోజులు మండలిలోనే ఉండి చేసిన చెత్త పనులు సరిపోనట్టు శ్రీ రంగ నీతులు చెబుతావా సాయి రెడ్డి?” అంటూ బుద్దా వెంకన్న విమర్శల వర్షం కురిపించారు.