హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అసత్యమని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కులవృత్తులకు సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారని తెలిపారు. బీసీల కోసం సీఎం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. కులవృత్తులకు ఏం చేయలేదన్న కోమటిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బీసీలను కోమటిరెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలు బాగుపడటం కోమటిరెడ్డికి ఇష్టం లేదన్నారు. బీసీల అభివృద్ధి కోసం సీఎం కట్టుబడి ఉన్నారని ఉద్ఘాటించారు.