న్యూఢిల్లీ : భారత్ లో వాయుకాలుష్యం పెచ్చరిల్లుతోంది. వాయు కాలుష్యం నిముషానికి ఇద్దరు భారతీయుల ఉసురు తీస్తున్నదని ఒక పరిశోధన వెల్లడించింది. వాయుకాలుష్యం భారత జనాభాపై పెను ప్రభావం చూపుతోందని సగటున నిముషానికి ఇద్దరు వాయుకాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ‘ ది లాన్సెట్’ అనే మెడికల్ జర్నల్ తన పరిశోధనా వ్యాసంలో పేర్కొంది.