ఓ కులంపై ద్వేషంతోనే రాజధానిని తరలిస్తున్నామని తెదేపా నేతలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. అదే నిజమైతే రాజధానిని జగన్ ఏ కడపో, కర్నూలో తరలుండేదని మంత్రి కొడాలి నాని అన్నారు. రాజధానుల అంశంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వంలా మేం ప్రజలకు భ్రమలు కల్పించలేదని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందని చంద్రబాబు అంటున్నారని రాజధాని ఎక్కడ పెడితే రాష్ట్రాభివృద్ధికి ఉపయోగమో చూడాలని హితవుపలికారు. దిల్లీ.. దేశానికి ఏమైనా మధ్యలో ఉందా? అని ప్రశ్నించారు.అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఇది చంద్రబాబు అమరావతి అని వ్యాఖ్యానించారు.