గుజరాత్ : గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలోని రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రఘువీర్ టెక్స్టైల్ మార్కెట్లోని పది అంతస్తుల భవనంలో మంటలు రాజుకున్నాయి. వస్త్ర దుకాణాలున్న మార్కెట్ లో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక శాఖ అధికారులు 50 అగ్నిమాపక వాహనాలను రప్పించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ అధికారులు శ్రమిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం ఇదే మార్కెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.