రాజధాని గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తుళ్లూరు నుంచి అసెంబ్లీ వైపు వెళ్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పలువురు రైతులకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రైతులు తమ బాధను అర్థంచేసుకోవాలని కోరుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాము అసెంబ్లీ వద్దకు వెళ్తామంటున్నారు. తమ ప్రాణాలైనా అర్పిస్తామనీ.. భూములు ఇచ్చి నష్టపోయామని విలపిస్తూ జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు తమకు సహకరించాలని కోరుతున్నారు. తామే భూములిచ్చాం తప్ప పోలీసులు, ఎమ్మెల్యేలు, మంత్రులెవరూ భూములివ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది తమకు జీవన్మరణ సమస్య అని.. ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.