ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటికి ప్రాధాన్యత ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 25, 2017, 01:53 AM

వెలగపూడి, సూర్య ప్రధాన ప్రతినిధి : బంగారం నీళ్ల రూపంలో ఉంటే ఎంత ప్రాధాన్యం ఇస్తామో ప్రతి ఒక్కరూ నీటి కి అంత ప్రాధాన్యత ఇవ్వాలని ఏపి స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పిలునునిచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం పరిధిలోని బలిజేపల్లి  గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏపి స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. డాక్టర్‌ కోడెల సత్యనారాయణ మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పెసర, పిల్లిపెసర, నూగులను అందించారు.  అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యార్థుల సేవలో రెవిన్యూ శాఖ కార్యక్రమంలో భాగంగా పిల్లల కు సర్టిఫికేట్స్‌ అందించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటి ప్రాధాన్యత ను గురించి ఇంకుడు గుంతలు, నీటి కుంటలను ఉద్యమ రూపంలో పూర్తిచేయాలని పిలుపునిచ్చారు. గతంలో మంజూరు చేసిన ఇళ్లు కాకుండా ఇంకెవరైన గృహలు కావలసిన పేదల ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా రాజుపాలెం లోని కోల్డ్‌ స్టోరేజ్‌ మిర్చియార్డు పరిధిలో ఉన్న నేపధ్యంలో రైతులు పడుతున్న కష్టాలు స్పీకర్‌ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే  మిర్చియార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావు తో ఫోన్‌ లో మాట్లాడిన స్పీకర్‌ ఈ కోల్డ్‌ స్టోరేజ్‌ విషయంలో ఇక్కడి  రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విత్తనాల పంపిణీ కార్యక్రమంలో వ్యవసాయ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు కు ఎప్పుడు ఏ విత్తనాలు ఇవ్వాలో అధికారులకే అవగాహన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంతో పాటు శిధిలావస్థకు చేరిన  ఆఫీస్‌ నిర్మాణానికి నిధులు కేటాయించాలని స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు జిల్లా కలెక్టర్‌ తో ఫోన్‌ లో మాట్లాడారు. అనంతరం మండలంలో రైతుల కరెంట్‌ సమస్యలపె అధికారులతో మాట్లాడారు. మండలంలో రావలసిన 71ట్రాన్స్‌ఫార్మర్స్‌, 400 వందల పోల్స్‌, ఇతర  విద్యుత్‌ పరికరాలు వెంటనే విడుదల చేయాలని  అధికారులతో ఫోన్‌ లో మాట్లాడారు. ఇది పూర్తి చేస్తే దాదాపు 500వందల మంది రైతుల మేలుచేకూరుతుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com