ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టిసీమ ప్రాజెక్టుతో పెరిగిన వృద్ధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 25, 2017, 02:07 AM

-ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణూడు


విజయవాడ, సూర్య బ్యూరో : పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టడం, రైతు రుణమాఫీ చేయడం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతను చంద్రబాబు నాయుడు ఇవ్వడం వల్ల రాష్ట్ర గ్రోత్‌ రేటు 11శాతం పైన సాధించిడం జరిగిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన  కృష్ణా జిల్లా మినీమహానాడుకు ముఖ్య అతిధిగా హాజరైన యనమల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చెయ్యిని విధంగా రైతులకు రూ.24వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. డెల్టారైతులకు పట్టిసీమ ద్వారా నీరు అందించి రైతులలో ఆనందం నింపిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. డ్వాక్రా మహిళలుకు ఇప్పటికే రూ.7వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. యువతకు ఎన్నికలో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే యూత్‌ పాలసీని తీసుకు వచ్చి ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, రెండు పొందని వారికి నిరుద్యోగ భృతి అమలు చేస్తామని హామి ఇచ్చారు. పేదవారి జీవన సరళి మారాలని బడ్జెట్‌ లో రూ.65వేల కోట్లు పేదప్రజలకు ఖర్చు చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతర పనిచేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించే శక్తి చంద్రబాబుకు ఉందన్నారు.  భారతదేశంలో సిద్దాంతాలతో తెలుగుదేశం పార్టీ నిలబడిందన్నారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేయడం నేను చేసుకున్న అదృష్టమని, పార్టీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయకత్వం వల్ల పార్టీ నిలబడిందన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీ తెలుగుదేశం పార్టీని ఎదుర్కోని నిలబడలేవన్నారు.2019లో తిరిగి తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని యనమల రామకృష్ణుడు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com