తిరుపతి, మేజర్న్యూస్ : భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ నైతిక విలువలు, ఆర్ష ధర్మాలపై అవగాహన కల్పించి నీతివంతమైన ఉత్తమ పౌరులు గా తీర్చిదిద్దాలనే ఉన్నతాశయంతో ప్రతి ఏడాది వేసవిలో శుభప్రదం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు టిటిడి తిరుపతి జెఇఓ పోల భాస్కర్ తెలి పారు. శుభప్రదం తరగతుల్లో బోధించే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 92 మంది ఉపాధ్యాయులకు, 23 మంది ధర్మప్రచార మండళ్ల సభ్యులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ఉదయం తిరుపతిలోని ఎస్వీయూ ఆర్ట్స బ్లాక్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జెఇఓ మాట్లాడుతూ 2012వ సంవత్సరం నుంచి టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుభప్రదం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది మరింత మెరుగ్గా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠ్యాంశాలను మెరుగుపరుస్తున్నట్టు చెప్పారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు వివరిం చారు. గతంలో ఉమ్మడి కుటుంబాల్లోని పెద్దలు మంచి విషయాలను పిల్లలకు చెప్పేవారని, ప్రస్తుతం చిన్న కుటుంబాల కారణంగా అది సాధ్యం కావడం లేదన్నారు. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆ బాధ్యతను తీసుకొని విద్యా ర్థులకు విలువలను బోధిస్తున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ధర్మప్రచార మండళ్లను బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు జెఇఓ తెలిపారు. ధర్మాన్ని రక్షించి భావితరాలకు అందించడం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారానే సాధ్యమన్నారు. శుభప్రదం తరగతుల సమయంలో ప్రథమ చికిత్స, తాగునీరు, ఆహారం, భద్రత, వసతి, పరిశుభ్రత తదితర అంశా లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇందు కోసం జిల్లాల్లో ఆయా విభాగాల అధికా రులకు లేఖలు రాశామని తెలిపారు. ఈ మూడు రోజుల శిక్షణ తరగతుల్లో శ్రీవేంకటేశ్వరుని జీవిత చరిత్ర, భగవద్గీత, సనాతన ధర్మపరిచయం, రామా యణ, భారత, భాగవత సందేశం, ఆర్ష వాఙ్మయం, వ్యక్తిత్వ వికాసం, భారతీ య కుటుంబ జీవనం, పండుగలు, పరమార్ధాలు, ఆచారలువైజ్ఞానిక దృక్పథం, మాతృభాష, విద్య, దేశభక్తి, తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మే 29, 30 తేదీల్లో కడప, హైదరాబాద్, వరంగల్, విశాఖ, కృష్ణా జిల్లాల్లో అక్కడి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారని జెఇఓ తెలిపారు. ఆ తరువాత జూన్ 3 నుంచి 9 వరకు విద్యా ర్థులకు శుభ ప్రదం శిక్షణ తరగతులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వరరావు, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఎపిక్ స్టడీస్ ప్రత్యేకాధికారి ఆచార్య దామోదర నాయుడు, పండితుల ఆచార్య గల్లా చలపతి, కసిరెడ్డి వెంకటరెడ్డి, నాగభైరవ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.