నరసాపురం, మేజర్న్యూస్ : తెలుగుదేశం పార్టీ అధినేత, నవ్యాంధ్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన పట్ల రాష్ట్ర ప్రజలు పూర్తి విశ్వా సంతో ఉన్నారనడానికి నిదర్శనం కొవ్యూరులో గోదావరి సాగర తీరాన నిర్వ హించే మినీ మహానాడుకు నియోజకవర్గ నలుమూలలా నుండి వందలాదిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్ళడమే ఇందుకు నిదర ్శనమని ఎమ్మెల్యే సోదరుడు,ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది చైర్మన్ బండారు పటేల్ రాజానాయుడు అన్నారు. బుధవారం ఉదయం కొవ్వూరులో నిర్వహించే మినీ మహానాడుకు నరసాపురం, మొగల్తూరు మండలాల నుండి తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. రాయపేట లోని పార్టీ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన వివిధ వాహనాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా మినీ మహా నాడు సభకు తరలివెళ్ళారు. ఈ యాత్రకు నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు డా చినిమల్లి సత్యనారాయణ రావు పార్టీ జెండా ఊపి ప్రారంభిం చారు. తెలుగుదేశం పార్టీ జెందాబాద్, చంద్రబాబు నాయుడు న్యాయకత్వం వర్ధిలాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు గావించారు. మినీ మహానాడుకు తరలి వెళ్ళిన వారిలో గోదావరి డెల్టా ప్రాజెక్టు చైర్మన్ పొత్తూరి రామ రాజు, ఏఎంసి చైర్మన్ రాయుడు శ్రీరాములు, మొగల్తూరు జెపిటిసి గుబ్బల నాగ రాజు, పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొప్పాడ రవి, గుగ్గిలపు ధర్మాజీ, పట్టణ వాణిజ్య సెల్ అధ్యక్షులు అంబటి ప్రకాష్ , తెలుగుయువత అధ్యక్షులు భూపతి బాబ్జి, నాయకలు గుబ్బల హరిచంద్రుడు, కొల్లు పెద్దిరాజు, గంధం వినయ్, చల్లా నాగరాజు, దొంగ మురళి, ఎంపిటిసిలు, జెపిటిసిలు,పార్టీ నాయకులు , కార్యకర్తలు మినీ మహానాడుకు తరలివెళ్ళిన వారిలో ఉన్నారు.