కర్నూలు: పత్తికొండ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యను నిరసిస్తూ ఆ పార్టీ నేడు చేపట్టిన కర్నూలు జిల్లా బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు యథాతథంగా తిరుగుతున్నాయి. వైకాపా నేతలు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టి దుకాణాలు మూయించి వేస్తున్నారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.