-ముంబయి దాడుల కీలక సూ్తధ్రారిపై వేటు
-ఉగ్రవాద నిరోధక చట్టంలోని నాలుగో షెడ్యూల్లో పేరు నమోదు
-నిర్ణయం తీసుకున్న పంజాబ్ ప్రావిన్స ప్రభుత్వం
-పాక్ హోంమ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నిర్ణయం
-ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలోనూ పేరు
ఇస్లామాబాద్: ముంబయి దాడుల కీలక సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్కు ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాద నిరోధక చట్టంలోని నాలుగో షెడ్యూల్లో అతడి పేరును చేరూస్తూ పంజాబ్ ప్రావిన్స ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అతడి కదలి కలపై ఇక నిత్యం నిఘా కొనసాగు తుంది. అంతేకాదు పోలీసుల కోరితే వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో హాజరు కావాల్సి ఉంటుంది. పాక్ హోంమంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు కౌంటర్ టెరర్ డిపార్టమెంట్ ఈ చర్యలు చేపట్టిందని పాక్ మీడియా పేర్కొంది. హఫీజ్తో పాటు మరో నలుగురు పేర్లను కూడా ఈ షెడ్యూల్లో చేర్చారు. అంతకుముందు హఫీజ్ను గత నెల 30న లాహోర్లో గృహ నిర్బంధంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం దేశం విడిచి పారిపోకుండా అతడి పేరును ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలోనూ చేర్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుంటే ఆంక్షలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో పాక్ ఈ చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తోంది.