వైయస్ విజయమ్మ, సీఎం సతీమణి వైయస్ భారతి విజయవాడలో ఓ క్రాఫ్ట్ మేళాను సందర్శించారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించారు. వస్త్రాలు, ఆభరణాలను పరిశీలించి కొనుగోలు చేశారు. పలువురు మహిళా సంఘాల నేతలు సీఎం సతీమణితో ప్రదర్శనలో పాల్గొన్నారు. సరికొత్త చేనేత చీరలను చూస్తూ విజయమ్మ ఆనందంతో పరవశించారు. అక్కడ ఉన్న మహిళలను కలుసుకొని చీరల గురించి అడిగి తెలుసుకున్నారు. శేషసాయి కళ్యాణ మండపంలో కొన్ని గంటల వరకు జనాలతో కిక్కరిసిపోయింది. వచ్చిన ప్రతి ఒక్కరికి అభివాదం చేసిన విజయమ్మ వారితో ఫోటో కూడా దిగారు.