మిస్ వరల్డ్ 2019 కిరీటం జమైకా సుందరి టోని అన్ దక్కించుకుంది. 120 దేశాల నుంచి ప్రాతినిధ్యం వహించిన అందాల భామలను వెనక్కి నెట్టి ఆమె విజేతగా నిలించింది. లండన్లో శనివారంనాడు రాత్రి జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహకులు టోని అన్ను విజేతగా ప్రకటించారు. గత ఏడాది ప్రపంచ సుందరి వనెస్సా పోన్స్ డి లియోన్ కొత్త అందాల భామకు కిరీటం అలంకరించారు. భారత్ నుంచి ప్రాతినిథ్యం మహించిన సుమన్ రావు రెండో రన్నరప్గా నిలిచింది. అంతకుముందు సుమన్రావు నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది.