శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జమ్ము కూడలి సమీపంలోని హనుమాన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం ములుపు తిరుగుతుండగా అటుగా వస్తున్న లారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇరువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే బాధితులు కోటబొమ్మలి మండలం లో దుప్పల్లి పాడు కు చెందిన మాడ అప్పన్న (28), మండ సాయమ్మ (50) గా గుర్తించారు. విషయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసుకు సమాచారం అందించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించినట్టు సమాచారం.