గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్స్టేషన్ వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కాల్మనీ వ్యాపారుల నుంచి కాపాడాలని నిరసనకు దిగాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి కాల్మనీ బాధితుడు ఉండవల్లికి చెందిన వెంకటేష్గా గుర్తించారు. రూ.6లక్షలు అప్పు ఇచ్చి రూ.23లక్షలు వడ్డీ వసూలు చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. డబ్బులు కట్టకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. వెంకటేష్ను స్థానికులు, పోలీసులు అడ్డుకున్నారు.