మర్రిపాడు మండలం, కంపసముద్రం గ్రామంలో నరేంద్ర, హరి కిరణ్ అనే ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం పాఠశాలకు వెళ్లిన ఇద్దరు చిన్నారులూ.. ఇంటర్వెల్ సమయంలో బయటకు వెళ్లారు. అయితే వారిద్దరూ.. తిరిగి పాఠశాలకు వెళ్ళలేదు. సాయంత్రం విషయం తెలిసిన చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.