ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్టుబడులకు స్వర్గధామం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 17, 2017, 03:01 AM

అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి: నవ్యాంధ్ర ప్రదేశ్‌ పెట్టబడులకు స్వర్గధామమని ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్‌ అమరనాథ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి అమరనాథ రెడ్డి సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌. ఈశ్వరన్‌ నేతృత్వంలోని వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లకు చెందిన ప్రతినిధుల బృందంతో కలిసి నెల్లూరు జిల్లా తడ మండలంలోని మమ్‌బట్టు వద్ద ఉన్న ఏపీ ఇండస్ట్రియల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీఐఐసి) పార్కును సందర్శించారు.  ఈ సందర్భంగా మంత్రి మమ్‌ బట్టు ఇండస్ట్రియల్‌ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలు, వనరుల లభ్యత తదితర అంశాలను సింగపూర్‌ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు వివరించారు. చెనై ్నకు సమీపంలో ఉన్న ఈ ఇండస్ట్రియల్‌ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతమైన చెప్పారు. 930 ఎకరాల్లో విస్తరించిన ఈ ఇండస్ట్రియల్‌ పార్కు ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసిన విషయాన్ని తెలియజేశారు. మమ్‌ బట్టు ఇండస్ట్రియల్‌ పార్కు తమకు ఎంతోగానో నచ్చిందని సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌ ఈశ్వరన్‌ అన్నారు. ఇక్కడ నీరు, విద్యు త్‌ లభ్యత పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతుందన్నారు. భవిష్యత్తులో వాణిజ్యపరంగా నవ్యాంధ్రకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఇండస్ట్రియల్‌ పార్కులో మంత్రి అమరనాథ రెడ్డి మొక్కలు నాటారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు కాలుష్య నివారణ చర్యలు కూడా అవసరమని, దీనికి చెట్లు నాటడం అవసరమని తెలిపారు.  ఈ కార్య క్రమంలో జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు, నాయుడుపేట ఆర్డీఓ శీన నాయక్‌, ఏపీఐఐసీ నెల్లూరు జోనల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. 


ఇండస్‌ కాఫీ ఫ్యాక్టిరీ ప్రారంభం...


మమ్‌ బట్టు ఇండస్ట్రియల్‌ పార్కులో స్థాపించిన ఇండస్‌ కాఫీ ప్రైవేటు లిమిటెడ్‌ ఫ్యాక్టిరీని ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ పరిశ్రమల శాఖమంత్రులు ఎన్‌ అమరనాథ రెడ్డి, ఎస్‌ ఈశ్వరన్‌ లు మంగళవారం అధికారికంగా ప్రారంభి ంచారు. అనంతరం ఫ్యాక్టిరీలో రోస్టింగ్‌, ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌, వివిధ దశ ల్లో కాఫీ తయారయ్యే పద్దతులను దగ్గరుండి పరిశీలించారు. ఏడాది క్రితమే 23 ఎకరాల్లో 80 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా 250 మందికి, పరోక్షంగా మరో 300 మందికి ఉపాధి దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com