నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
అమరావతి, మేజర్న్యూస్ : రైతు సమస్యలపై రాష్ట్ర ప్రభు త్వానికి చిత్తశుద్ధి లేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ నిర వధిక వాయిదా అనంతరం ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ప్రభుత్వానికి పీవీ సింధు మీద ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. ఒక క్రీడాకారిణిగా సింధుపై అభిమానం ఉండటంలో తప్పులేదు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని రైతుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు మిర్చి కొనుగోలుకు రూ.2 కోట్లు మాత్రమే ఇచ్చారని మిర్చి యార్డ్కు సెలవు ప్రకటించారని చెప్పారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి కాబట్టే యార్డ్కు సెలవు ఇచ్చారని రైతులు సమస్యల్లో ఉంటే యార్డ్ను మూసేస్తారా అని ప్రశ్నించారు. మిర్చికి కేంద్రం రూ.5వేలు ఇస్తానన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేద న్నారు. రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మోసం చేశారని టీడీపీపై మండిపడ్డారు. రుణమాఫీ విషయంలోనూ మాట తప్పి రైతు లను దగా చేశారన్నారు. జీఎస్టీ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదని అయితే రెం డు నిమిషాల్లో అయ్యేదానికి ప్రభుత్వం రాద్ధాంతం చేసిందన్నారు. రైతుల సమ స్యలపై మాట్లాడదామంటే ప్రభుత్వం తప్పించుకొందన్నారు. అ అంటే అభివృద్ధి అమరావతి కాదు. అ అంటే అవినీతి, అ అంటే అరాచకాలు, అ అంటే అనా రోగ్యం, అ అంటే అబద్ధాలు అని ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు.