దేశంలోని వివిధ నాయకులపై జరుగుతున్న ఐటి దాడులు, సిబిఐ కేసుల నమోదు మొదలైన అంశాల్లో ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు, లాలూ ప్రసాద్ యాదవ్, మాయావతి, ములాయంసింగ్ యాదవ్ తదితరులపై జరుగుతున్న దాడులలో ప్రభుత్వ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ, ఐటి, ఇడి తదితర ఏ ఏజెన్సీని తాము ఉపయోగించుకోవడం కాని, దుర్వినియోగపరచడం కాని జరుగలేదని ఆయన అన్నారు.