అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలులో రాబోతుందని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో సోలార్, విండ్ ఎనర్జీపై ఫోకస్ పెట్టామని తెలిపారు. దీని కోసం టెస్లాను సంప్రదించామన్నారు. రాబోయే రోజుల్లో ఎలక్ర్టానిక్ వాహనాలు రాబోతున్నాయి. అన్ని వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విద్యుత్ రంగంలో రెండో దశ సంస్కరణలకు నాంది పలుకుతున్నామని పేర్కొన్నారు.