ముంబయి: క్రికెట్ దిగ్గజం సచిన్ కుమారుడు అర్జున్ తెందూల్కర్కు ఏమైంది..? క్రచెస్(వూతకర్ర)తో ఎందుకు నడుస్తున్నాడు. ప్రస్తుతం అభిమానులను కలవరపెడుతున్న ప్రశ్న ఇది. బుధవారం రాత్రి ముంబయిలో ప్రముఖ పాప్స్టార్ జస్టిన్ బీబర్ కన్సర్ట్ జరిగింది. అభిమానులు ‘ఇండియన్ బీబర్’గా పిలుచుకునే అర్జున్ తెందూల్కర్ ఈ షోకు వెళ్లాడు. అయితే అక్కడ అర్జున్ వూతకర్రలతో నడుస్తూ కన్పించాడు. అతడి ఎడమ కాలుకు బ్యాండేజ్ ఉంది. దీంతో అర్జున్కు ఏమైంది అని అభిమానులు తెగ ఆందోళన పడుతున్నారు.