ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైతూ చెప్పిన డైలాగ్ ..అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2017, 05:48 PM

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా మే 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈరోజు (మే 13 శనివారం) ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్‌ ట్రైలర్‌ను అక్కినేని నాగర్జున ట్విట్టర్‌లో రిలీజ్‌ చేశారు. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంటూ చైతూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు శ్రోతల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది.నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, కౌసల్య, ఇర్షాద్‌(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్‌, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్‌, ఇష్క్‌ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్‌: రాజుసుందరం, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, నిర్మాత: నాగార్జున అక్కినేని, కథ, మాటలు, దర్శకత్వం: కళ్యాణ్‌కృష్ణ కురసాల.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com