తిరుపతి, మేజర్న్యూస్ : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జునస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి ఈవో డా డి.సాంబశివరావు శనివారం పట్టు వసా్తల్రు సమర్పిం చారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టిటిడి ఈవోకు శ్రీశైలం ఆలయ అధికారులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికి పట్టువస్త్రాలను స్వీకరించారు. ఫిబ్రవరి 16 నుండి 27వ తేదీ వరకు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ రోజుల్లో స్వామివారికి ఈ పట్టువసా్తల్రను అలంకరిస్తారు.