ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు గుంటూరులో ఉద్యోగ సంఘాల జెఎసి సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 19, 2017, 12:40 AM

  విజయవాడ, సూర్య బ్యూరో : రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) సమావేశం నేడు (ఆదివారం) గుంటూ రు పట్టణంలోని ఎన్‌జీవో హోంనందు నిర్విహ స్తున్న ఉద్యోగ సంఘాల  జెఎసి  రాష్ర్ట అధ్యక్షు డు పి. అశోక్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్లపై కూలంకƒశంగా చర్చించడం జరుగుతుందని తెలిపారు. వీటితోపాటు జెఎసి పునర్‌: వ్యవస్థీక రణ, నియమావళిలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వారు తెలిపారు. జెఎసి రాష్ర్ట కార్యవర్గ సభ్యులు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 105 ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా జెఎసి అధ్యక్ష కార్యదర్శులు సమావేశం లో పాల్గొననున్నారని  నేటి ఉదయం 11 గంటల నుండి గుంటూరు  ఎన్‌జీవో హోంనందు సమావేశం జరుగుతుందని అశోక్‌బాబు ప్రకటనలో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com